
- ఉద్యోగాల పేరుతో 6 కోట్ల మోసం…నకిలీ IAS అరెస్ట్
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను… ఆలయానికి నిధులు మంజూరు చేయిస్తాని ఆలయ సిబ్బంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఓ వ్యక్తిని చాదర్ ఘాట్ పోలీసులు అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి ఓ లాప్ టాప్ రెండు సెల్ ఫోన్లు, నాలుగున్నర తులాల బంగారు నగలు, 5 డెబిట్ కార్డులను, ఇతర నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
పార్లమెంటులో ఆఫీసర్ అని చెప్పి..
వరంగల్ కు చెందిన 29 ఏళ్ల సంపత్ కుమార్ హైదరాబాద్ మేడిపల్లిలో ఉంటున్నాడు. నగరంలో చాలా మందికి తాను IAS అధికారినని… పార్లమెంటులో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పని చేస్తున్ననని చెప్పుకొని తిరుగుతున్నాడు. నకిలీ గుర్తింపు కార్డులు కూడా సృష్టించుకున్నాడు. నిరుద్యోగులే టార్గెట్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి దాదాపు 20 మంది నిరుద్యోగుల నుంచి 6 కోట్ల రూపాయలను వసూలు చేశాడు.
ల్యాప్ టాప్ రిపేర్ చేయించుకుంటుంటే అరెస్టు..
మరోవైపు మలక్ పేట లో ఓ టెంపుల్ దగ్గర తాను ధర్మకర్తనని తనకు తాను గా పరిచయం చేసుకుని ఈ టెంపుల్ కు 60వేలు విరాళంగా ఇచ్చి నమ్మించాడు. హడ్కో నుంచి 3కోట్ల నిధులు ఇప్పిస్తానని ఆ ఆలయ సిబ్బందిని నమ్మించి కోటి ముప్పై ఎనిమిది లక్షలు వసూలు చేశాడు. అయితే ఇప్పిస్తానన్న నిధులు ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి ఆలయ సిబ్బంది చాదర్ ఘాట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు దిల్ సుఖ్ నగర్ దగ్గర లాప్ టాప్ రిపేరు చేయించుకుంటుండగా పక్కా సమాచారం తో సంపత్ కుమార్ ను పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.