మద్యం నకిలీ లేబుల్స్ గుట్టురట్టు.. 15 రకాల సామగ్రి స్వాధీనం

మద్యం నకిలీ లేబుల్స్ గుట్టురట్టు.. 15 రకాల సామగ్రి స్వాధీనం

మల్కాజిగిరి, వెలుగు: మద్యం నకిలీ లేబుల్స్​ తయారీ గుట్టురట్టయింది. హుజూర్ నగర్ లో కల్తీ మద్యం తయారీ కేసులో లభించిన ఆధారాలతో స్పెషల్​టాస్క్​ఫోర్స్​ బృందం కుషాయిగూడలో దాడులు నిర్వహించింది. అంజిరెడ్డి టీం ఆధ్వర్యంలో టాస్క్​ఫోర్స్​ అధికారులు మంగళవారం కల్తీ మద్యం తయారీ కోసం నకిలీ లేబుల్స్ తయారు చేస్తున్న కేంద్రాన్ని గుర్తించారు. 

గడ్డమీది నవీన్ గౌడ్ అనే వ్యక్తి శివసాయినగర్ నాగార్జున కాలనీలో ఓ ప్రింటింగ్​ ప్రెస్​ ఏర్పాటు చేశాడు. మద్యం నకిలీ లేబుల్స్ తయారుచేసేందుకు మల్టీ కలర్ మెషీన్లు, 15 రకాల సామగ్రిని ఉపయోగిస్తున్నారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని ప్రకాశ్​, రాజేశ్​ను అరెస్ట్​ చేశారు.