SSC బోర్డు పేరుతో నకిలీ వెబ్సైట్ల కలకలం

SSC బోర్డు పేరుతో నకిలీ వెబ్సైట్ల కలకలం

హైదరాబాద్: SSC బోర్డు పేరుతో నకిలీ వెబ్సైట్లు హల్ చల్ చేస్తున్నాయి. నకిలీ SSC  బోర్డు పేరుతో రెండు వెబ్ సైట్లను గుర్తించారు బోర్డు అధికారులు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి, ఏప్రిలో జరగనున్న క్రమంలో నకిలీ వెబ్ సైట్లు ప్రత్యక్షం కావడంతో అటు విద్యార్థులు, ఇటు అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

నకిలీ వెబ్ సైట్లను వెంటనే తొలగించాలని గురువారం (జనవరి 18) సీసీఎస్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు బోర్డు అధికారులు. నకిలీ వెబ్ సైట్ల నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ విభాగం డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.