ప్రగతిభవన్ ముందు కుటుంబం ఆత్మహత్యాయత్నం

ప్రగతిభవన్ ముందు కుటుంబం ఆత్మహత్యాయత్నం

ప్రగతిభవన్ ముందు ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. ఇబ్రహీంపట్నానికి చెందిన ఐలేశ్ అనే వ్యక్తి కుటుంబంతో సహా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. తన భూమిని తీసుకున్న ప్రభుత్వం పరిహారం చెల్లించడం లేదని ఐలేష్ ఆరోపించారు. ఉన్న భూమి పోయి బతుకుదెరువు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పరిహారం ఇచ్చి తమను ఆదుకోవాలని అభ్యర్థించారు.