నిజాంపేట, వెలుగు: ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకపోవడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నిజాంపేట్ మండలంలో చోటుచేసుకుంది. తిప్పనగుళ్ల గ్రామానికి చెందిన బెల్లం మల్లయ్య ( 53 )కు ఎకరం పొలం ఉంది. గత వానాకాలం సీజన్ లో అప్పుతెచ్చి అందులో వరి పంట సాగు చేశాడు. అయితే ఆశించిన దిగుబడి రాక నష్టపోయాడు. పంట సాగు పెట్టుబడికి చేసిన అప్పు, మిత్తితో కలిపి రూ.4 లక్షల వరకు అయ్యింది. అంతేగాక, భూమి విషయంలోనూ గత ఐదేండ్ల నుంచి కోర్టులో కేసు నడుస్తోంది. అప్పుల బాధతోపాటు కేసు కూడా తేలడం లేదని మల్లయ్య మనస్తాపానికి గురయ్యాడు. గురువారం ఊరి చివర చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. భార్య బీరవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
పంట దిగుబడి రాలేదని రైతు ఆత్మహత్య
- హైదరాబాద్
- December 29, 2023
లేటెస్ట్
- MI vs KKR: కోల్కతా చేతిలో ఓటమి.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై
- 34 కేజీల బంగారం, 40 కేజీల వెండి స్వాధీనం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి.. కార్యకర్త మృతి
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Rajamouli-Chandoo Mondeti: రాజమౌళి లెటర్ని..ఫ్రేమ్ కట్టించుకున్న డైరెక్టర్ చందు మొండేటి.. ఎందుకో తెలుసా?
- రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంటే..ట్విట్టర్ టిల్లు ఎందుకు ప్రశ్నించట్లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- MI vs KKR: నిద్రలేచిన ముంబై బౌలర్లు.. 169 పరుగులకు కోల్కతా ఆలౌట్
- TS టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు