రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తా

రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తా
  • గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్

  • చిలుక మధుసూదన్ రెడ్డి

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్​గా నియమితులైన చిలుక మధుసూదన్ రెడ్డి శనివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రంగారెడ్డి జిల్లా ఇన్​చార్జ్​మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రోడ్డు డెవలప్మెంట్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పారు. తనకు అప్పగించిన బాధ్యత గొప్పదని, రైతులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తానని చెప్పారు.  వైస్ చైర్మన్ భాస్కర్ చారి, డైరెక్టర్లు జైపాల్ రెడ్డి, రఘుపతి, గణేశ్, నవరాజ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.