జగిత్యాల జిల్లా: సీరియల్ ప్రకారం కాకుండా ఇష్టమొచ్చిన రీతిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నారంటూ అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపాడు ఓ రైతు. జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం కల్లెడలోని ప్యాక్స్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాడు రైతు తిరుపతిరెడ్డి. 15 రోజులు అవుతున్నా.. ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సీరియల్ ప్రకారం కాకుండా.. అధికారులు తమకు నచ్చినట్లు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశాడు.
ఇవి కూడా చదవండి