పంటకు నిప్పు పెట్టిన రైతన్న

పంటకు నిప్పు పెట్టిన రైతన్న

తెలంగాణలో రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ఓ రైతు నిప్పు పెట్టాడు. ఈ ఘటన పెద్దపల్లి మండలం చందపల్లి గ్రామంలో తోట పెద్దన్న అనే రైతు తన రెండున్నరు ఎకరాల వరి పంటకు నిప్పు పెట్టాడు. ప్రభుత్వం సన్న వడ్లు వెయ్యమంటే వేసానని.. అయితే పంటకు చీడ పురుగు,దోమకాటు వస్తే అప్పులు తీసుకొచ్చి మందులు కొట్టానన్నాడు. అయినా కూడా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో పంటకు నిప్పు పెట్టనని వాపోయాడు రైతు పెద్దన్న. వరికోత యంత్రానికి అయ్యే ఖర్చుకు కూడా పంట రాని పరిస్థితి ఉందన్నాడు. అందుకే ఆవేదనతో పంటను తగులబెట్టానన్నాడు పెద్దన్న.

For more news :

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆఫీస్ రిటర్న్ ఇప్పట్లో లేనట్లే..

సర్పంచ్ పదవికి వేలం పాట