రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో రగడ

 రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో రగడ

మెదక్ జిల్లా నర్సాపూర్ రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో రచ్చ జరిగింది. ధాన్యం కొనుగోలు కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే తెలంగాణ దశాబ్ది వారోత్సవాలు ఎందుకని బీఆర్ఎస్ నాయకులను స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రైతు వేదిక కార్యక్రమానికి చేరుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు.

రోడ్డుపై బైఠాయించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. BRS నాయకులు.. కేసీఆర్ జిందాబాద్ అంటూ..కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ బాహాబహి నినాదాలు చేసుకున్నారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.