కేసులు వెంటనే ఎత్తివేయాలని రైతులు డిమాండ్

కేసులు వెంటనే ఎత్తివేయాలని రైతులు డిమాండ్

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వృథాగా పోతున్న నీటి కోసం 2018లో ఆయకట్టు రైతులు ఆందోళన చేపట్టారు. అప్పట్లో ఆందోళనల్లో పాల్గొన్న 53 మంది రైతులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సాగునీరు అడిగినందుకు తమపై అక్రమ కేసులు పెట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం బాల్గొండ నియోకజవర్గంలోని పలు గ్రామాల రైతులకు కోర్టు సమన్లు జారీ చేశారు. ఈనెల 6, 7 తేదీల్లో కోర్టుకు హాజరు కావాలని నోటీసులిచ్చారు. తమపై ఉన్న కేసులు వెంటనే ఎత్తివేయాలని రైతులు డిమాండ్ చేశారు.