మధుమేహం.. డయాబెటిస్.. షుగర్ వ్యాధి ఈ మూడు ఒకటే.. ఇది వచ్చిందా అస్సలు తగ్గదు.. కాని కచ్చితంగా కంట్రోల్ గా ఉంచుకోవాల్సిందే.. రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువ ఉన్నా.. తక్కువ ఉన్నా ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు వస్తాయి.ఈ వ్యాధి గతంలో 40 ఏళ్లు దాటితే వచ్చేది. కాని ప్రస్తుతం ఇరవై ఏళ్లకే షుగర్ వ్యాధితో బాధ పడుతున్నవారి సంఖ్య ఎక్కువుగా ఉంటుంది. అంటే మనం తినే ఆహారంలో కచ్చితంగా మార్పులు చేసుకోవాల్సిందే.. మధు మేహం ఉన్నవారు ఏమి తినాలి.. ఏమి తినకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
డయాబెటిస్ శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. కళ్ళు, మూత్రపిండాలు, కాలేయం, గుండె అన్ని సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. మధుమేహ వ్యాధి ప్రపంచమంతటా వేగంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధి విషయంలో భారతదేశం నెంబర్వన్గా కొనసాగుతోంది
డయాబెటిస్ ఉన్నవారు తినకూడనవి
- బంగాళాదుంప
- స్వీట్స్
- చాక్లెట్స్
- కేకులు
- బిస్కెట్లు
- కూల్ డ్రింక్స్
- ఐస్ క్రీమ్
- ఫాస్ట్ ఫుడ్
- జంక్ ఫుడ్
- తెల్ల బియ్యం
- డీప్ ఫ్రై పదార్ధాలు
- అధిక నూనెతో తయారు చేసిన వంటలు
- షుగర్ కలిపిన జ్యూసులు
- చిలగడదుంపలు ( స్వీట్ పొటాటో)
- బ్రెడ్
- మైదాతో చేసిన పదార్ధాలు
కచ్చితంగా తినాల్సినవి
- క్యాబేజీ
- దొండకాయ
- కాకరకాయ
- బెండకాయ
- పాలకూర
- బచ్చలి కూర
- క్యాబేజీ
- కాలీఫ్లవర్
- కీరదోసకాయ
- టమోటా
- జామ
- ఆపిల్ (మితంగా)
- రాగి రొట్టె
- జొన్న రొట్టె
- పప్పులు
- శనగలు
- బీరకాయ
- ఉసిరి కాయతో చేసిన పదార్ధాలు
- నిమ్మకాయ లేదా నిమ్మరసం ( పంచదార లేకుండా)
- నారింజ పండు
- బొప్పాయి
- క్యారెట్
- బ్రకోలీ
- ముల్లంగి
- గుమ్మడికాయ
- క్యాప్సికం
- మెంతికూర
- ముల్లంగి
- చేదు పొట్లకాయ
- పచ్చి అరటి వంటి
- వంటలో ఆవాల నూనె లేదా పొద్దుతిరుగుడు నూనె ఉపయోగించాలి
ఇంకా క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయాలి. ఒత్తిడిని నివారించడానికి ప్రాణాయామం, ధ్యానంతో పాటు రోజుకు కనీసం అరగంట పాటు నడవాలి.
