- రంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాల్లో గుర్తులు వేస్తున్న సర్వే బృందాలు
ఇబ్రహీంపట్నం, వెలుగు :హైదరాబాద్-–పుణె, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–-అమరావతి-–చెన్నై బుల్లెట్ట్రైన్పనులు స్పీడందుకున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్-–చెన్నై కారిడార్కోసం ఫీల్డ్లెవెల్లో సిబ్బంది సర్వే చేసి మార్కింగ్చేస్తున్నారు. రంగారెడ్డి నుంచి నల్గొండ, వికారాబాద్ జిల్లాల వైపు సర్వే బృందాలు వేగంగా మార్కింగ్వేస్తూ వెళ్తున్నాయి. మహేశ్వరం, కందుకూరు, యాచారం మండలాల మీదుగా నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వైపు పది రోజులుగా సర్వే చేస్తున్నారు.
పొలాలు, ఇతర ప్రాంతాల్లో ఎరుపు-, తెలుపు రంగులతో ప్రత్యేక గుర్తులు వేస్తున్నారు. యాచారం మండలంలోని కురుమిద్ద, మేడిపల్లి, మల్కిజ్గూడెం, తక్కళ్లపల్లి, చింతపట్ల, నల్ల వెల్లి, మంథన్ గౌరెల్లి గ్రామాల పరిధిలో ఇప్పటికే మార్కింగ్పూర్తయ్యింది. కారిడార్ ఎలైన్మెంట్, సర్వే పాయింట్లు, భూసేకరణ అవసరాలను గుర్తించేందుకు ఈ మార్కింగ్ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.
హైస్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి ఇప్పటికే ఏరియల్ సర్వే పూర్తయ్యింది. సాధ్యాసాధ్యాల అధ్యయనం కొనసాగుతోంది. సర్వే పూర్తయిన తర్వాత తుది ఎలై న్మెంట్, స్టేషన్ల స్థానాలు, భూసేకరణ వివరాలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
