అదనపు TMC పేరుతో భూములను లాగేసుకుంటున్రు

అదనపు TMC పేరుతో భూములను లాగేసుకుంటున్రు

మల్లన్నసాగర్ అదనపు TMC కోసం చేస్తున్న భూసర్వేని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు సిద్ధిపేట జిల్లా వాసులు.  మిడన్ మానేరు ప్రాజెక్టు నుంచి సిద్ధిపేట రూరల్ మండలం బండ చెర్లపల్లి మీదుగా నీటిని తీసుకెళ్ళేందుకు భూసర్వే చేపట్టారు అధికారులు. దీన్ని నిరసిస్తూ రాస్తారోకో చేశారు బండ చెర్లపల్లి గ్రామస్థులు. గతంలో చేపట్టిన సర్వేనీ కాదని… ఇప్పుడు మరో సర్వే చేయడంపై మండిపడుతున్నారు. కొత్త సర్వే ప్రకారం భూమిని తీసుకుంటే ఇవ్వడానికి తాము సిద్ధంగా లేమన్నారు. కేసీఆర్, హరీష్ రావు డౌన్ డౌన్ అంటూ నినాదాలుచేశారు. గంటసేపు రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.  రైతులకు న్యాయ చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.