వడ్ల పైసలు వేయాలని రాస్తారోకో

వడ్ల పైసలు వేయాలని రాస్తారోకో

మెట్ పల్లి, వెలుగు: కొనుగోలు సెంటర్లలో రైతుల నుంచి కొన్న వడ్లకు సంబంధించిన పైసలు వెంటనే చెల్లించాలని కాంగ్రెస్​లీడర్లు హైవేపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్‌‌రెడ్డి, లీడర్లు మాట్లాడుతూ వానాకాలం సీజన్ షురూ అయ్యిందని, రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోళ్లకు డబ్బుల్లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారన్నారు. గ్రామాల్లో యువ రైతులు వ్యవసాయాన్ని బంద్ చేసి ఇతర దేశాలకు వలస పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో లీడర్లు అంజిరెడ్డి , లింగారెడ్డి, తిరుపతిరెడ్డి, క్రాంతి కుమార్, సంతోష్ రెడ్డి, మారుతి, రాంప్రసాద్, సురేందర్ రెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు.