కరీంనగర్ జిల్లాలో యూరియా యాప్ ను రద్దు చేయాలి : రైతులు

కరీంనగర్ జిల్లాలో  యూరియా యాప్ ను రద్దు చేయాలి :  రైతులు

శంకరపట్నం, వెలుగు: యూరియా యాప్ రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ రైతులు మొలంగూర్ సింగిల్ విండో ఆఫీస్​ ఎదుట శనివారం ధర్నా చేపట్టారు. పట్టాదారు పాస్ బుక్​తో ఆధార్, మొబైల్ నంబర్​ లింక్​ లేని, ఆండ్రాయిడ్ మొబైల్ లేని తాము ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ తో సంబంధం లేకుండా యూరియా బస్తాలు పంపిణీ చేయాలన్నారు. 

ఏవో వెంకటేశ్, ఏఈవో అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. అక్కడికక్కడే ఆధార్, మొబైల్​ నంబర్​ లింక్​ చేశారు. యూరియా కొరత లేదని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు.