వడ్ల పైసల కోసం బ్యాంక్​ దగ్గర చెప్పుల క్యూ!

వడ్ల పైసల కోసం బ్యాంక్​ దగ్గర చెప్పుల క్యూ!

మెదక్ (వెల్దుర్తి), వెలుగు : వెల్దుర్తి లోని సెంట్రల్​ బ్యాంక్​ అకౌంట్​నుంచి ధాన్యం అమ్మిన, రైతుబంధు పైసలు డ్రా చేసుకునే విషయంలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. మూడు రోజుల కింద రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూలైన్​లో నిలబడే ఓపిక లేక ఖాతాదారులు తమ చెప్పులను క్యూలైన్​లో ఉంచిన సంగతి తెలిసిందే. బ్యాంక్​ కు డబ్బులు తక్కువగా వస్తుండడం, స్టాఫ్​ తక్కువగా ఉండడంతో డబ్బుల చెల్లింపులో ఆలస్యమవుతోంది. 

దీంతో ఖాతాదారులు గంటల తరబడి వేచి ఉండక తప్పడం లేదు. రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో శుక్రవారం డబ్బులు అవసరమైన వారు బ్యాంక్​ తెరవక ముందే వచ్చారు. అయినా అప్పటికే రష్​ఉండడంతో చెప్పులను క్యూలైన్​ లో ఉంచారు. ఆ సీరియల్​ ప్రకారమే బ్యాంక్​ లోకి వెళ్లి డబ్బులు విత్​డ్రా చేసుకున్నారు.