పాక్‎లో ఘోర రోడ్డు ప్రమాదాలు.. 23 మంది మృతి

పాక్‎లో ఘోర రోడ్డు ప్రమాదాలు.. 23 మంది మృతి

లాహోర్/పెషావర్: పాకిస్తాన్‌‌‌‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు కారణంగా ఓ ట్రక్కు వంతెనపై నుంచి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పిల్లలు సహా 14 మంది మరణించారు. పంజాబ్ ప్రావిన్స్‌‌‌‌లోని సర్గోధ జిల్లా కోట్ మోమిన్‌‌‌‌లో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. యాక్సిడెంట్​జరిగిన సమయంలో ట్రక్కులో 23 మంది ఉన్నారని పంజాబ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ రెస్క్యూ ప్రతినిధి తెలిపారు. 

వారంతా వారి బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఇస్లామాబాద్ నుంచి ఫైసలాబాద్‌‎కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. “భారీ పొగమంచు కారణంగా మోటార్​వే మూసివేశారని.. ట్రక్కును డ్రైవర్​లోకల్​రూట్‎లో తీసుకెళ్లాడని.. ఆ రూట్​లో విజిబిలిటీ సరిగా లేకపోవడం వల్ల వెహికల్​నియంత్రణ కోల్పోయి గాలాపూర్ బ్రిడ్జి పై నుంచి నీరులేని కాలువలో పడిపోయిందని రెస్క్యూ ప్రతినిధి తెలిపారు. 

ప్యాసింజర్​​ వెహికల్ ​బోల్తాపడి 9 మంది..

మరో ఘటనలో బలూచిస్తాన్ ప్రావిన్స్‌‌‌‌లోని గ్వాదర్ సమీపంలో మక్రాన్ కోస్టల్​హైవేపై శనివారం తెల్లవారుజామున ప్యాసింజర్ వెహికల్​బోల్తా పడి 9 మంది మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. వెహికల్​అతివేగం కారణంగానే బోల్తా పడి ఈ ప్రమాదం జరిగిందని కోస్టల్ హైవే ఎస్పీ తెలిపారు.