నిజామాబాద్/ బోధన్, వెలుగు: ఎమ్మెల్యే షకీల్పై మర్డర్అటెంప్ట్కేసులో అన్యాయంగా తన కొడుకు అల్తాఫ్ను ఇరికించి జైళ్లో పెట్టారని అతడి తండ్రి అబ్దుల్బాకీ గురువారం కన్నీరు పెట్టుకున్నారు. తన కొడుక్కి ఏ పాపం తెలియదని ఖురాన్ నెత్తిన పెట్టుకొని ఏడ్చారు. బక్రీద్ సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్పట్టణ శివారులోని దర్గా వద్ద ముస్లిం సోదరులు నమాజ్చేస్తున్నారు. నమాజ్ ముగిసిన తర్వాత వేదికపైకి ఖురాన్తో వచ్చిన బాకీ, మైక్ఎదుట బోరున విలపించారు. ఆ సమయంలో దర్గా వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న ఏసీపీ కిరణ్కుమార్, సీఐ ప్రేమ్కుమార్దగ్గర్లోనే ఉన్నారు. కన్నీరు పెడ్తున్న అబ్దుల్బాకీని తోటి ముస్లింలు ఓదార్చి పక్కకు తీసుకెళ్లారు. హత్యాయత్నం కేసు ఎదుర్కొంటూ, అజ్ఞాతంలో ఉన్న బీఆర్ఎస్వార్డు కౌన్సిలర్ మీర్నజీర్అలీ వీడియో విడుదల చేశారు. పండగ వేళ చేయని తప్పుకు ఫ్యామిలీకి దూరంగా ఉన్నామని పేర్కొన్నారు. డెవలప్మెంట్గురించి ప్రశ్నించిన తమపై ఎమ్మెల్యే షకీల్హత్యాయత్నం కేసులు పెట్టించారని, ఆయన్ను ఓడించి గుణపాఠం చెప్తామన్నారు.