ఉత్తర్ప్రదేశ్లో ఒ వింత ఘటన చోటుచేసుకుంది. 28 ఏళ్ల కోడలిని 70 ఏళ్ల మామ వివాహం చేసుకున్నాడు. గోరఖ్పుర్ జిల్లాలోని ఛపియా ఉమ్రావ్ గ్రామంలో కైలాష్ యాదవ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. కైలాశ్ యాదవ్ దంపతులకు నలుగురు సంతానం ఉన్నారు. అందరూ వివాహాలు చేసుకుని ఎవరికి వారు జీవిస్తున్నారు. అయితే 12 ఏళ్ల క్రితం కైలాశ్ భార్య చనిపోయింది. కాగా, కొన్నేళ్ల క్రితం కైలాష్ 3వ కుమారుడు చనిపోయాడు. దీంతో అతడి భార్య పూజ ఒంటరిగా మిగిలింది. ఇదిలా ఉండగా ఇటీవలే కైలాష్ తన కోడలు పూజను స్థానికంగా ఉన్న గుడిలో పెళ్లి చేసుకున్నాడు. పూజ నుదుట కైలాష్ సింధూరం దిద్దాడు. అనంతరం ఇద్దరూ పూల దండలు మార్చుకుని ఒక్కటయ్యారు.ఈ పెళ్లికి పూజ తరపు బంధువులు, గ్రామస్థులు హాజరయ్యారు.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులకు విషయం తెలిసింది. అయితే, పెళ్లి గురించి ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఇది ఇద్దరి వ్యక్తుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగిన వివాహమని, కావునా తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని బర్హల్గంజ్ పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.