గుంటూరు జిల్లా: మద్యం మత్తులో సొంత కొడుకునే చంపేశాడు ఓ తండ్రి. ఈ సంఘటన గురువారం ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది. పొన్నూరు, నిడుబ్రోలుకు చెందిన తండ్రీ కొడుకులిద్దరూ మద్యం మత్తులో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. మాటా మాటా పెరగడంతో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువురు పరస్పరం రోకలి బండతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కొడుకు కొక్కిలిగడ్డ అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టమ్ కోసం డెడ్ బాడీని హాస్పిటల్ కి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.