భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేటీఆర్ టూర్ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. బందోబస్తుకు వచ్చిన మహిళా హెడ్ కానిస్టేబుల్ సీతారాముల ఆలయం దగ్గర గోదావరి కరకట్ట కాలువలో పడి గల్లంతయ్యింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి కరకట్ట స్లూయిస్ ల వద్ద కానిస్టేబుల్ మృతదేహాన్ని వెలికితీశారు.
మహిళా హెడ్ కానిస్టేబుల్ వాహనాలు పార్కింగ్ చేసే స్థలం వద్ద నుంచి అన్నదాన సత్రం వైపు నడుచుకుంటూ వస్తుండగా డ్రైనేజీ కాలువలో జారి పడింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాల్వలోకి దిగి గాలించగా.. గోదావరి కరకట్ట స్లూయిస్ ల వద్ద కానిస్టేబుల్ మృతదేహాన్ని వెలికితీశారు. మృతురాలు కొత్తగూడెం వన్ టౌన్ కానిస్టేబుల్ శ్రీదేవిగా గుర్తించారు పోలీసులు. హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి భర్త పేరు రామారావు, కొత్తగూడెం ఎస్ బి కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు వీళ్లకు ఒక బాబు, పాప ఉన్నారు.
Also Read :- రూ. 2 కోట్ల నగదు..కిలోల కొద్దీ బంగారం
భారీ వర్షం కారణంగా కేటీఆర్ భద్రాచలం పర్యటన రద్దు అయినట్లు అధికారికంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రకటించిన సంగతి తెలిసిందే.