కొంపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల పంచాది

కొంపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల పంచాది

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంపల్లి మున్సిపల్ పరిధిలోని ఉమామహేశ్వర కాలనీలో కాంగ్రెస్ నేతలు కొలను హనుమంతరెడ్డి, కందాడి జ్యోత్స్నలు కార్యకర్తలతో కలిసి హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించారు. అయితే వారి యాత్రను కొందరు బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. తమ కాలనీ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రానివారు, ఇప్పుడేందుకు వచ్చారంటూ కాంగ్రెస్ నేతలను నిలదీశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.  

బీఆర్ఎస్ నేతల తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల్లో ఉంటూ, వారికి తోడుగా ఉంటున్నామని.. అది చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ కౌన్సిలర్ జ్యోత్స్న రెడ్డి మండిపడ్డారు. అధికారాన్ని బలం అడ్డుపెట్టుకుని మమ్మల్ని ఆపాలని చూస్తే ప్రజలే బుద్ది చెపుతారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.