యశోద అసుపత్రిలో కేసీఆర్‌ను పరామర్శించిన నాగార్జున

యశోద అసుపత్రిలో కేసీఆర్‌ను పరామర్శించిన నాగార్జున

యశోద అసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్  కేసీఆర్ ను  సినీ నటుడు అక్కినేని నాగార్జున పరామర్శించారు. కేసీఆర్ కోలుకుంటున్నారని,  బాగా మాట్లాడుతున్నారని చెప్పారు.  కేసీఆర్ త్వరగా కోలుకోని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఇక అదే అసుపత్రిలో చికిత్స పొందుతున్న  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలిసినట్లుగా నాగార్జున తెలిపారు.  

ఎర్రవల్లి తన నివాసంలోని బాత్‌రూంలో జారిపడటంతో కేసీఆర్‌ ఎడమ తుంటికి తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు  వెంటనే సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు.  అక్కడ వైద్యులు కేసీఆర్‌కుతుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆస్పత్రిలోనే ఉంటూ కోలుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు రాజకీయ నాయకులు ఆసుపత్రికి వచ్చి కేసీఆర్ ను పరామర్శిస్తున్నారు.