
జ్వరం లక్షణాలతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నంను డిశ్చార్జ్ చేస్తారని తెలుస్తోంది. అతడిని మరోసారి పరీక్షించగా కోవిడ్ నెగటివ్ రిపోర్టు వచ్చినట్లు సమాచారం. దీంతో మంగళవారం డిశ్చార్జ్ చేస్తారని వార్తలు వెలువడుతున్నాయి. ఆందోళన చెందాల్సినదేమీ లేదని.. ముందు జాగ్రత్తగా చెన్నైలోని ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. మణిరత్నం దర్శకత్వంలో నిర్మించిన ‘పొన్నియన్ సెల్వన్ - 1’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్య రాయ్ బచ్చన్, విక్రమ్, కార్తీ, జయం రవితో పాటు చాలా మంది ఈ మూవీలో నటించారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే విడుదలైన టీజర్ సంచలనం సృష్టిస్తోంది. చారిత్రక నవల పొన్నియన్ సెల్వన్ (The Son Of Ponni) ఆధారంగా మూవీని రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30న విడుదల చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇటీవల వెటరన్ హీరో శరత్ కుమార్.. ఆ తర్వాత విక్రమ్ కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా దర్శకుడు మణిరత్నం కరోనా బారినపడడం ఒకింత ఆందోళనకు గురిచేస్తున్నా.. స్వల్ప లక్షణాలేనని చెబుతుండడం అభిమానులకు ఊరట కలిగిస్తోంది.