కత్రినా కైఫ్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న విక్కీ కౌశల్

కత్రినా కైఫ్ తో  స్క్రీన్ షేర్ చేసుకోనున్న విక్కీ కౌశల్

సినీ ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. స్టార్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ కలిసి మొదటిసారిగా స్ర్కీన్ ను షేర్ చేసుకోబుతున్నారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అది సినిమాలో కాదు. ఈ జంట ఓ టీవీ ప్రకటన కోసం ఓకే స్ర్కీన్ పై కనిపించబోతున్నారట. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొదటిసారిగా ఇలా స్ర్రీన్ ను షేర్ చేసుకోబుతున్నారంటూ వస్తున్న ప్రచారంతో ఇప్పటికే ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు.. ఈ వార్తతో కాస్త సంతోషం దక్కనుంది. అయితే వీరి షూటింగ్‌కి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఫొటోలలో, వారిద్దరూ సౌకర్యవంతమైన దుస్తులలో సాధారణ లుక్ లో కనిపిస్తున్నారు.

కత్రినా, విక్కీ కౌశల్ డిసెంబర్ 2021 లో రాజస్థాన్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొంతకాలం పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ కపుల్...  పెద్దల అంగీకారంతో దాదాపు రెండు సంవత్సరాల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. హర్రర్ అండ్ కామెడీ చిత్రం ఫోన్ బూత్ లో సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్ లతో నటిస్తుండగా, ఈ మూవీ నవంబర్ 4, 2022న విడుదల కానుంది. దీంతో పాటు విజయ్ సేతుపతితో మెర్రీ క్రిస్మస్ లో నటిస్తోంది. సల్మాన్ ఖాన్ తో టైగర్ 3లో నటిస్తుండగా.. ఈ మూవీ ఏప్రిల్ 23, 2023న విడుదల కానుంది.