నాపై నమోదైన ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ను కొట్టేయండి .. మాధవీలత పిటిషన్‌‌‌‌‌‌‌‌

నాపై నమోదైన ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ను కొట్టేయండి ..  మాధవీలత పిటిషన్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు:  తనపై బేగంబజార్‌‌‌‌‌‌‌‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ను కొట్టేయాలంటూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత హైకోర్టును ఆశ్రయించారు.  బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి మాధవీలత ఓ వర్గం మనోభావాల్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని, శ్రీరామనవమి శోభాయాత్రలోనూ ఆమె  ఓ ప్రార్థనా మందిరంపై బాణాన్ని గురిపెట్టారని ఆరోపిస్తూ సిటీకి చెందిన ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌ షేక్‌‌‌‌‌‌‌‌ ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మేరకు పోలీసులు ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ నమోదు చేశారు. ఆ ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ను కొట్టేయాలని, తనకు అన్ని మతాలు, కులాలపై గౌరవం ఉందని అన్యాయంగా తనపై కేసు నమోదు చేశారని మాధవీలత హైకోర్టులో  పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. దీన్ని హైకోర్టు మంగళవారం విచారించే అవకాశం ఉంది.