కూకట్ పల్లిలోని ఇంక్ తయారీ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. రూ.2 కోట్ల ఆస్తి నష్టం

కూకట్ పల్లిలోని ఇంక్ తయారీ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. రూ.2 కోట్ల ఆస్తి నష్టం

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లి పరిధి ప్రశాంతినగర్​పారిశ్రామిక వాడలోని ఏబీసీ ప్రింటింగ్ ఇంక్​ తయారీ పరిశ్రమలో మంగళవారం రాత్రి షార్ట్ ​సర్క్యూట్​ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగి, ఫ్యాక్టరీ అంతా వ్యాపించాయి.

వర్కర్స్​సాయంత్రం 6 గంటలకే విధులు ముగించుకుని వెళ్లిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఫైర్​ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునేలోపే రా మెటీరియల్, మెషినరీ కలిపి మొత్తం రూ.2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని ఫ్యాక్టరీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.