హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మింట్ కంపౌండ్ లోని ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చలరేగాయి. ప్రమాదంలో పుస్తకాలు ముద్రించే మిషిన్లు, పలు పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి. కార్యాలయంలో పని చేసే సిబ్బంది బయటకు పరగు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే కార్యాలయం వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. తెల్లవారుజామున జామున ఈ అగ్నిప్రమాదం జరగడంతో ఉద్యోగులు, కార్మికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన పై కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు.