సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్​లో జులై 2న స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  రైల్వే స్టేషన్  రెజిమెంటల్ బజార్  ఓ హోటల్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ చుట్టు పక్కల ప్రాంతాలను ఆవరించింది. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన ఫైర్​ స్టేషన్​ సిబ్బందికి సమాచారం అందించారు.  పోలీసులు బిల్డింగ్​పైన  లాడ్జిలో ఉన్న వారిని ఖాళీ చేయించారు. 

ఫైర్​ ఇంజిన్ వాహనం వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.  పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  అధికారులు అనుమతి లేని లాడ్జీలు, హోటళ్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు  డిమాండ్ చేశారు