హైదరాబాద్లో అగ్ని ప్రమాదం.. దట్టంగా అలుముకున్న పొగలు

హైదరాబాద్లో అగ్ని ప్రమాదం.. దట్టంగా అలుముకున్న పొగలు

హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. పంజాగుట్ట చౌరస్తా దగ్గర ఉన్న ఓ ఫ్లై ఓవర్ పిల్లర్ కు ఏర్పాటు చేసిన డెకరేట్ బోర్డుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో అక్కడి పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా అలుముకుంది. 

ప్రగతి భవన్ కు కూతవేటు దూరంలో ఈ  ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. మంటలను అదుపు చేశారు. అనంతరం ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.