కామారెడ్డి పోస్టాఫీస్ లో అగ్నిప్రమాదం

కామారెడ్డి పోస్టాఫీస్ లో అగ్నిప్రమాదం
  • కాలిపోయిన కంప్యూటర్లు, ఫర్నిచర్, రికార్డులు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా హెడ్​ పోస్ట్​ఆఫీస్​లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. ఆఫీస్​ఆవరణలో ఉన్న పాత బిల్డింగ్​లో పాస్​పోర్ట్, ఈ సేవా ఆఫీస్ ​ఉంది. ఈ బిల్డింగ్​లో ఆకస్మాతుగా మంటలు చెలరేగడంతో అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులు, ఫైర్​ఆఫీసర్లకు సమాచారమిచ్చారు. అప్పటికే మంటలు చెలరేగి రూమ్స్​లో ఉన్న కంప్యూటర్స్, ఫర్నిచర్, రికార్డులు కాలిపోయాయి. 

ఫైర్​సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే చాలా వరకు నష్టం వాటిల్లింది. మంటల్ని అర్పడంతో మెయిన్​ఆఫీస్​కు నష్టం జరగలేదు. షాట్ ​సర్క్యూట్​తోనే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు వివరాలు సేకరించారు.