ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్ నియోజకవర్గం బైరామల్గూడలోని ‘సుధామయ్ పేపర్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే అట్టల కంపెనీలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. కంపెనీ గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురై పోలీసులు, ఫైర్సిబ్బందికి సమాచారం ఇచ్చారు. నాలుగు ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపుచేశాయి.
ఆదివారం సెలవు కావడంతో గోదాంలో ఎవరూ లేరు. రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. షార్ట్సర్క్యూటే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.