హైదరాబాద్ గోషామహల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దారుసలం, గౌస్ పూరాలోని బాలాజీ ప్లైఉడ్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో జనం పరుగులు తీశా. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఫైర్ సిబ్బంది త్వరగా రావడంతో పెను ప్రమాదం తప్పింది.
బీజేపీ గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫైర్ సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనా స్థలాన్ని వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరాదీస్తున్నారు. ఈ ఘటనలో ఆర్థిక నష్టం ఎంత జరిగిందో తెలియాల్సి ఉంది.