ఓనర్ ను మోసుకుని వచ్చిందని..గుర్రాన్ని క్వారంటైన్ కు పంపిన పోలీసులు

ఓనర్ ను మోసుకుని వచ్చిందని..గుర్రాన్ని క్వారంటైన్ కు పంపిన పోలీసులు

గుర్రాలకూ కరోనా కష్టం తప్పడం లేదు. నిన్నటిదాకా తోటి అశ్వాలతో కలిసి హాయిగా ఉన్న ఈ గుర్రాన్ని ఇప్పుడు క్వారంటైన్ చేసేశారు. కాశ్మీర్ లోయ నుంచి తన ఓనర్ ను మోసుకుని రావడం వల్లే దీనికీ కష్టం వచ్చింది. జమ్మూలోని రాజౌరీ జిల్లాకు చెందిన ఈ గుర్రం ఓనర్.. బుధవారం దీనిపై ఎక్కి కాశ్మీర్ లోయలోని సోఫియాన్ జిల్లా నుంచి సొంత ఊరికి వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రాజౌరీ జిల్లా గ్రీన్ జోన్ లో ఉంది. సోఫియాన్ జిల్లానేమో.. రెడ్ జోన్ లో ఉంది. అందుకే.. ముందుజాగ్రత్తగా ఓనర్ ను గవర్నమెంట్ క్వారంటైన్ కు పంపి.. దీనిని ఇలా క్వారంటైన్ చేశారు. ఇది దగ్గితే.. వైరస్ వ్యాపించొచ్చని మూతికి ఓ సంచిని కూడా కట్టారు!