అది రెండు రూములు ఉండే రేకుల ఇల్లు. అందులో రెండు ట్యూబ్ లైట్లు, ఒక ఫ్యాన్, టీవీ మాత్రమే ఉన్నాయి. కానీ ఆ ఇంటికి ఏకంగా రూ. 19,19,268 రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. మార్చి 4 నుంచి జూన్ 3 వరకు 9,04,259 యూనిట్ల కరెంట్ కాలిందని బిల్లులో ఉంది. నల్గొండ పట్టణంలో ఈ సంఘటన జరిగింది. దీనిపై ఆ ఇంట్లో అద్దెకుండే మాధవి అనే మహిళ కరెంట్ అధికారులను నిలదీయగా, బిల్లును మళ్లీ సరిచేశారు. 321 యూనిట్లు కాలిందని.. రూ.1,002 బిల్లు ఇచ్చారు. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్లనే ఇట్ల జరిగిందని ఏఈ శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ నెల రాష్ట్రమంతా కూడా కరెంట్ బిల్లులు ఎక్కువగానే వచ్చాయి. దీన్నిబట్టి చూస్తే అన్ని బిల్లులు కరెక్టో కాదో అనే అనుమానం రాక మానదు.
For More News..
