సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్ కేపీ దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు నిర్మాతలు.
ప్రస్తుతం హై- ఆక్టేన్ క్లైమాక్స్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు. ఈ క్లైమాక్స్ కోసం రూ.20 కోట్లకు పైగా కేటాయించారని, 35 రోజుల షెడ్యూల్ జరగనుందని తెలియజేశారు. ఇందులో 18 భారీ యాక్షన్ బ్లాక్లు ఉంటాయని, స్టంట్ డైరెక్టర్ కెవిన్ మాస్టర్ ఈ సీక్వెన్స్లను కొరియోగ్రఫీ చేస్తున్నాడని చెప్పారు.
సాయి దుర్గ తేజ్ ఇంతకు ముందెన్నడూ చూడని ఎక్స్పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవికృష్ణ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా రిలీజ్ చేయనున్నారు.
