నేపాల్లోని సింధుపాల్ చోక్ జిల్లాలో ఇవాళ( శుక్రవారం) ఘోర ప్రమాదం జరిగింది. కొండ చరియలు విరిగిపడి ఐదుగురు మృతిచెందగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయపడ్డారు. మరో 38 మంది జాడ తెలియకుండా పోయింది. ఈ ఉదయం 6:30 గంటలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 12 ఇండ్లకు పైగా నేలమట్టమయ్యాయి. శిధిలాల నుండి ఐదు మృతదేహాలను వెలికితీశాయి సహాయ సిబ్బంది.
ఈ ప్రమాద ఘటనపై లామా టోల్ వార్డ్ చీఫ్ ప్రతాప్ లామా స్పందించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి మెరుగైన ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు.