నేపాల్ లో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి

నేపాల్ లో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి

నేపాల్‌లోని సింధుపాల్‌ చోక్ జిల్లాలో ఇవాళ( శుక్ర‌వారం) ఘోర ప్రమాదం జరిగింది. కొండ చ‌రియ‌లు విరిగిప‌డి ఐదుగురు మృతిచెంద‌గా.. ఎనిమిది మందికి తీవ్ర గాయప‌డ్డారు. మ‌రో 38 మంది జాడ తెలియ‌కుండా పోయింది. ఈ ఉద‌యం 6:30 గంటలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 12 ఇండ్ల‌కు పైగా నేలమట్టమయ్యాయి. శిధిలాల నుండి ఐదు మృతదేహాలను వెలికితీశాయి సహాయ సిబ్బంది.

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై లామా టోల్ వార్డ్ చీఫ్ ప్ర‌తాప్ లామా స్పందించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి మెరుగైన ట్రీట్ మెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు.