
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా ఐదుగురి జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ పంకజ్ మిట్టల్, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ మిశ్రాలు సుప్రీం జడ్జీలుగా బాధ్యతలు స్వీకరించారు.
జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రాల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం గతేడాది డిసెంబర్ 13న సిఫారసు చేసింది. అయితే కేంద్రం రెండు నెలలకు ఆమోదం తెలిపింది. ఇక ఈ ఐదుగురి చేత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. ఐదుగురితో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కి పెరిగింది.