జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఐదుగురు టెర్రరిస్టులు హతం

జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఐదుగురు టెర్రరిస్టులు హతం

జమ్మూకశ్మీర్‌లో పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇవాళ(మంగళవారం) షోపియాన్ జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య  కాల్పులు జరిగాయి.తుల్రాన్ ప్రాంతంలో జరిపిన ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిబా అనుభంద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కు చెందిన ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు.వీరిలో ఒకరిని ముఖ్తార్ షాగా భద్రతా దళాలు గుర్తించాయి. వీరి దగ్గర నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. 
 
మరోవైపు ఫీరిపోరాలో మరో ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి భద్రతా దళాలు.ఉగ్రవాదుల వేట ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు పోలీసు అధికారులు.