హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి 9 వ తరగతి చదువుతున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. ఆ తర్వాత స్కూల్లో, బాలిక నివసిస్తున్న బస్తీలో చెబుతానంటూ, బ్లాక్ మెయిల్ చేస్తూ మరో నలుగురితో కలిసి ఆమెపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ బాలిక ఇంట్లో చెప్పుకోలేదన్న ధైర్యంతో ఆ ఐదుగురిలోని ఒక మైనర్ బాలుడు 7వ తరగతి చదువుతున్న బాలిక చెల్లెలితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ చెల్లెలు జరిగిన విషయాన్ని ఇంట్లో తెలిపింది. వారి తల్లిదండ్రులు ఇద్దరు కూతుళ్లనీ అడగడంతో అసలు విషయం బయటపడింది. అత్యాచారం గురించి తెలుసుకున్న వారు ఐదుగురిపై కమాటిపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. వీరిలో ముగ్గురు మైనర్లు, ఇద్దరు మేజర్లని తెలిసింది. వారిపై అత్యాచారం, పొస్కో యాక్ట్ క్రింద కేసు నమోదు చేశారు పోలీసులు.