రికార్డ్ స్థాయిలో కరోనా రికవరీ కేసులు..ఒక్కరోజే 94వేల మందికి పైగా తగ్గిన వైరస్

రికార్డ్ స్థాయిలో కరోనా రికవరీ కేసులు..ఒక్కరోజే 94వేల మందికి పైగా తగ్గిన వైరస్

గడిచిన 24 గంటల్లో దేశంలో 94,612 మంది కరోనా వైరస్ నుంచి కోరుకున్నారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్ నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 43.03లక్షలుగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రికవరీ రేటు 79.68 శాతానికి చేరుకుందని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

దేశంలో కొత్తగా రికవరీ అయిన 60శాతం కేసులు ఐదురాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో తెలిపింది. వాటిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాలు ఉన్నాయని ప్రకటించింది. అంతేకాకుండా శనివారం 52శాతం కొత్త కేసులు పైన తెలిపిన ఐదురాష్ట్రాల్లో నమోదయ్యాయి.

ఇక రికవరీ కేసులు మహరాష్ట్రలో 23వేలు, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రెండూ ఒకే రోజు రికవరీలకు 10,000 కి పైగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. వరుసగా రెండు రోజులు 94,000 కంటే ఎక్కువ మందికి కరోనా తగ్గిందని కేంద్రం ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది.