ఇండియా మ్యాప్ తప్పుగా చూపిన వాట్సాప్

ఇండియా మ్యాప్ తప్పుగా చూపిన వాట్సాప్
  • ఆగ్రహం వ్యక్తంచేసిన కేంద్ర మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్​
  • వెంటనే వీడియో తొలగింపు

న్యూఢిల్లీ: ఇండియా మ్యాప్​ను తప్పుగా పోస్ట్​ చేసిన వాట్సాప్​పై కేంద్ర మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్​ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏ దేశంలో వ్యాపారం చేయాలని అనుకుంటున్నారో, వ్యాపారం కొనసాగించాలని అనుకుంటున్నారో.. ఆ దేశానికి సంబంధించి సరైన మ్యాప్ ను ఉపయోగించాలని హితవు పలికారు. సాధ్యమైనంత త్వరగా ఈ పొరపాటును సరిదిద్దాలని కోరారు. ట్విట్టర్​ వేదికగా మంత్రి స్పందిస్తూ.. వాట్సాప్​ మాతృసంస్థ మెటా కంపెనీకి ట్యాగ్​ చేశారు.

ఏం జరిగింది..?

నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి వాట్సాప్​ తన ట్విట్టర్​ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో గ్లోబ్​లో పీవోకే తో పాటు చైనా తనదిగా చెబుతున్న ప్రాంతాలను ఇండియా మ్యాప్ లో నుంచి తొలగించి చూపింది. కేంద్ర మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్​ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు వీడియోను వాట్సాప్​ తొలగించింది.