కార్డు చెల్లింపులకు బయోమెట్రిక్ వెరిఫికేషన్

కార్డు చెల్లింపులకు బయోమెట్రిక్ వెరిఫికేషన్

హైదరాబాద్​, వెలుగు:  కార్డు చెల్లింపుల కోసం ఫ్లిప్‌‌కార్ట్, యాక్సిస్ బ్యాంక్, పేయూ బయోమెట్రిక్ వెరిఫికేషన్​ను ప్రారంభించాయి.  వినియోగదారులు ఓటీపీ అవసరం లేకుండానే ముఖ గుర్తింపు లేదా వేలిముద్రతో లావాదేవీలు చేయవచ్చు. 

ఈ సదుపాయం మొదటగా యాక్సిస్ బ్యాంక్ కార్డు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. సిమ్ మార్పిడి, ఓటీపీ మోసాలను అరికట్టడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని ఫ్లిప్‌‌కార్ట్ తెలిపింది. పేయూ సంస్థ దీనికి అవసరమైన టెక్నాలజీని అందిస్తోంది.