
న్యూఢిల్లీ: మనదేశాన్ని "బొమ్మల ఎగుమతి కేంద్రం"గా మార్చేందుకు ఫ్లిప్కార్ట్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) చేతులు కలిపాయి. బొమ్మల సప్లై చైన్ లో భారతదేశ సామర్థ్యాలు పెంపొందించటానికి డీపీఐఐటీ వర్క్షాప్ను నిర్వహించింది. అధిక-నాణ్యత గల బొమ్మలను ఉత్పత్తి చేయడంపై ఇది దృష్టి సారించింది. వందలాది బొమ్మల తయారీదారులు ఈ వర్క్షాప్లో పాల్గొన్నారు. ఫ్లిప్కార్ట్ నిపుణులతో వీళ్లు నాణ్యత మెరుగుదల, ఆవిష్కరణలు, పరిశ్రమ ప్రమాణాల గురించి చర్చించారు.