రాజకీయ నాయకుడి ఇంట్లోకి చేరిన వరద నీరు

రాజకీయ నాయకుడి ఇంట్లోకి చేరిన వరద నీరు

పాట్నా: బిహార్ లో వరదలతో.. సామాన్య జనంతో పాటు.. రాజకీయ నేతలు ఇబ్బందులు పడుతున్నారు. జేడీయూ సీనియర్ నేత అజయ్ అలోక్ ఇంటిలోకి భారీగా వరద నీరు చేరింది. వరద నీటితో ఇంటి ఆవరణ నిండిపోయింది. బెడ్ రూంలోకి కూడా నీరు చేరింది. దీంతో ఆయన కూడా సహాయక సిబ్బంది కోసం ఎదురు చూస్తున్నారు

మరోవైపు భారీ వర్షాలు, వరదలతో రైళ్ల రాకపోకలు చాలా వరకు నిలిచిపోయాయి. పాట్నాకు వచ్చే రైళ్లను చాలా వరకు నిలిపేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. వర్షాలు తగ్గే వరకు రైళ్లను నడిపే పరిస్థితి లేదంటున్నారు అధికారులు. రైళ్లు నడవకపోవడంతో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో స్టేషన్ లో నిలిచిపోయారు.

Flood water enters the residence of Janata Dal United (JDU) leader Ajay Alok,