బస్సులు, రైళ్లల్లో నిల్చొని వెళ్లినట్లు.. ఇక నుంచి విమానాల్లోనూ నిల్చొని వెళ్లొచ్చు.. టికెట్ రేటు చాలా తక్కువ..!

బస్సులు, రైళ్లల్లో నిల్చొని వెళ్లినట్లు.. ఇక నుంచి విమానాల్లోనూ నిల్చొని వెళ్లొచ్చు.. టికెట్ రేటు చాలా తక్కువ..!

బస్సులు, రైళ్లల్లో నిల్చొని వెళ్లటం కామన్.. ఇది రెగ్యులర్ కూడానూ.. విమానాల్లో నిల్చొని వెళ్లటం ఎప్పుడైనా విన్నామా.. చూశామా.. ఇప్పటి వరకు లేదు.. ఇక నుంచి వింటారు.. చూస్తారు కూడానూ.. దీనికి ఎంతో కాలం లేదు.. జస్ట్ మరో ఏడాది కాలంలోనే ఇది నిజం కాబోతున్నది. యూరప్ దేశాల్లో దీన్ని అతి త్వరలోనే అమల్లోకి తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఇప్పటికే దీనికి సంబంధించి ప్లాన్ మొత్తం రెడీ అయ్యింది. విమానాల్లో నిల్చొని వెళ్లే వాళ్ల కోసం ప్రత్యేకంగా సీట్లు కూడా తయారు అయ్యాయి.. సీట్లో కూర్చుని వెళ్లే వాళ్లకు.. నిల్చొని వెళ్లే వాళ్లకు టికెట్ రేటు ఒకటేనా అనే డౌట్ రావొచ్చు.. కచ్చితంగా కాదు.. నిల్చొని వెళ్లేవాళ్లకు టికెట్ రేటు చాలా తక్కువగా ఉంటుంది అంట.. 20 నుంచి 25 శాతం తక్కువ అంట.. పూర్తి వివరాలు చూసేద్దామా..

ఫ్లైట్ జర్నీ అంటేనే కాస్లీ. దీంతో చాలా మంది విమాన ప్రయాణాలు చేయాలంటే డబ్బులకు బయపడి వెనక అడుగు వేస్తారు. దాని కంటే తక్కువ ధరలు ఉండే ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటారు. ఇలాంటి వారి కోసం విమానయాన సంస్థలు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అదే స్టాండింగ్ సీట్ విధానం. అంటే ఏమిలేదు ఫ్లైట్‎లో నిలబడి జర్నీ చేయడం. కూర్చొని ప్రయాణించడం కంటే ఈ స్టాడింగ్ జర్నీ టికెట్ ధర తక్కువ.

ప్రయాణికులకు చౌకైన ధరలకు విమాన ప్రయాణి సదుపాయం కల్పించాలని లక్ష్యంగా ఎయిర్ లైన్స్ ఈ విధానాన్ని తీసుకొస్తున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ స్టాడింగ్ సీట్ జర్నీ విధానం 2026 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. యూరప్‌లోని కొన్ని ఎయిర్ లైన్స్ తమ ఎకానమీ సీటింగ్‌లోని కొన్ని భాగాలను స్టాండింగ్ సీట్లతో భర్తీ చేయాలని చూస్తున్నాయని యూరో వీక్లీ న్యూస్ నివేదించింది. 

ఈ సీటింగ్ ఎలా ఉంటుందంటే..?

స్కైరైడర్ 2.0 అని పిలువబడే ఈ సీట్లను ఇటాలియన్ కంపెనీ అవియోఇంటీరియర్స్ తయారు చేసింది. ఈ సీట్లు ప్యాడెడ్ సైకిల్ జీను మాదిరిగా ఉంటుంది. సీట్ బెల్ట్ కూడా ఉంటుంది. 45-డిగ్రీల కోణంలో సీట్లు వంగి ఉంటాయి. స్కైరైడర్ సీట్లు విమానయాన నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని, అన్ని భద్రతా పరీక్షలలో పాస్ అయ్యాయని ఏవియోఇంటీరియర్స్ తెలిపింది. దీంతో ప్రయాణికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఈ స్టాడింగ్ సీటింగ్ విధానం వల్ల ప్రయాణికులతో పాటు ఎయిర్ లైన్స్ సంస్థలకు కూడా లాభమే. ప్రయాణికులకు ఏమో టికెట్ ధర తక్కువగా ఉంటుంది. ప్రతి సీట్ యూనిట్ తక్కువ స్థలాన్ని అక్రమించడం ఎయిర్‌లైన్స్ సంస్థలకు బెనిఫిట్. రెండు గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం పట్టే రూట్లలోని విమానాల్లో 20 శాతం ఈ స్టాడింగ్ సీట్లు ఏర్పాటు చేయాలని ఎయిర్ లైన్స్ సంస్థలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తేలికైన సీట్లు, సరళమైన డిజైన్, క్లీన్ చేయడానికి తక్కువ సమయం స్టాడింగ్ సీటింగ్ ప్రత్యేకత. ఇది విమానయాన సంస్థలు విమానాల మధ్య టర్నరౌండ్ సమయాన్ని తగ్గించడానికి వీలు కల్పిస్తుంది.