ఫుడ్ ఆర్డర్ ఆలస్యమై గొడవ.. కాల్పుల్లో ఒకరు మృతి

ఫుడ్ ఆర్డర్ ఆలస్యమై గొడవ.. కాల్పుల్లో ఒకరు మృతి

గ్రేటర్​ నోయిడా: ఫుడ్ ఆర్డర్ ఆలస్యమై ఓ రెస్టారెంట్ లో గొడవ జరిగి ఓనర్ ను కొందరు కాల్చిచంపారు. ఈ ఘటన ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో మంగళవారం రాత్రి చోటుచేసుకోగా ముగ్గురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మిత్ర అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లోపలి రెస్టారెంట్ కు మంగళవారం రాత్రి స్విగ్గీ ఆన్ లైన్ ప్లాట్ ఫాం నుంచి ఫుడ్ ఆర్డర్ వచ్చింది. దాన్ని కలెక్ట్ చేసుకునేందుకు డెలివరీ బాయ్ అక్కడికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ డెలివరీ బాయ్​కి బైక్​పై వచ్చి ముగ్గురు వ్యక్తులు కలిశారు. వారితో మాట్లాడిన తర్వాత ఆర్డర్ తీసుకునేందుకు డెలివరీ బాయ్ వెళ్లగా ఆలస్యమవుతుందని రెస్టారెంట్ సిబ్బంది చెప్పారు. దీంతో గొడవ మొదలైంది. అయితే మద్యం మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు కలుగజేసుకుని రెస్టారెంట్ ఓనర్​ సునీల్ అగర్వాల్ పై కాల్పులు జరిపి పారిపోయారు. గాయపడిన ఓనర్​ను సిబ్బంది ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గాలింపు మొదలు పెట్టిన పోలీసులు బుధవారం రెస్టారెంట్ దగ్గర్లోని సందులో ముగ్గుర్నీ అదుపులోకి తీసుకున్నరు.