అత్త డెత్ సర్టిఫికెట్ కోసం రూ.2వేల లంచం

 అత్త డెత్ సర్టిఫికెట్ కోసం   రూ.2వేల లంచం

జయశంకర్ భూపాలపల్లి :  లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రేగొండ రెవెన్యూ కార్యాలయ ఏఎస్​వో చిక్కాడు. అదే గ్రామానికి చెందిన వడ్ల మల్లికార్జున్ నుంచి అతడి అత్త డెత్ సర్టిఫికెట్ కోసం ఏఎస్​వో  రూ. 2వేల లంచం డిమాండ్​ చేశాడు. భూపాలపల్లి మంజూరునగర్​ లోని కలెక్టర్​ ఆఫీస్​ మెయిన్​ గేట్​ వద్ద ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఏఎస్​వో మొగుల్ల రఘుపతికి నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ప్రస్తుతం భూపాలపల్లి ఆర్​డీవో ఆఫీస్‌‌లో ఏఎస్​వోను అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు.