అల్టిమేట్ ఖో ఖో లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫారిన్ ప్లేయర్లకు అనుమతి

అల్టిమేట్ ఖో ఖో లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫారిన్ ప్లేయర్లకు అనుమతి

గురుగ్రామ్: అల్టిమేట్ ఖో ఖో (యూకేకే) లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంటర్నేషనల్ ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు నవంబర్ 29న మొదలయ్యే లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫారిన్ ప్లేయర్ల పార్టిసిపేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ) శుక్రవారం (June 13)  ఆమోదం తెలిపింది. 

రాబోయే సీజన్ కోసం నిర్వహించే  వేలంలో ఇంటర్నేషనల్ ప్లేయర్లను చేర్చుతామని కేకేఎఫ్ఐ ప్రెసిడెంట్ సుధాన్షు మిట్టల్ తెలిపారు. ‘ఖో ఖో లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలిసారి అంతర్జాతీయ ఆటగాళ్లను అనుమతించాలన్న సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు గర్విస్తున్నాం. 

ఈ నిర్ణయం యూకేకేలో పోటీ నాణ్యతను పెంచడమే కాకుండా ఖో ఖో ఆటకు ఇండియాను  గ్లోబల్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చాలనే  మా విజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ప్రతిబింబిస్తుంది’ అని అన్నారు. ఖో ఖోతో సహా దేశీయ క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో  కేకేఎఫ్ఐ, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీటీ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 

కాగా,  యూకేకే లీగ్ తొలి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒడిశా జాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాట్స్ విజేతగా నిలవగా.. గత ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గుజరాత్ జెయింట్స్ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కైవసం చేసుకుంది