పొయ్యిల కట్టెలకు వెళ్తే ఫారెస్టోళ్లు కొట్టిన్రు

పొయ్యిల కట్టెలకు వెళ్తే ఫారెస్టోళ్లు కొట్టిన్రు

దండేపల్లి, వెలుగు: పొయ్యిలోకి కట్టెల కోసం అడవికి వెళ్లిన వ్యక్తిని అటవీ అధికారులు విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్ లో జరిగింది. గ్రామానికి చెందిన భనవత్ నారాయణ లింగపూర్, అజ్మీర సుధాకర్ లింగపూర్ మకులపేట శివారుకు వెళ్లారు. ఆ టైంలో తల్లపేట డీఆర్ఓ ప్రమోద్ కుమార్ సిబ్బందితో అక్కడికి వచ్చారు. టేకు కట్టెలు కొడుతున్నారా అని అడిగారు. పొయ్యిలోకి కట్టెలు కోసం వచ్చామని, టేకు చెట్లు ముట్టుకో లేదని చెబుతున్నా వినకుండా డీఆర్వో తోపాటు సిబ్బంది వారిని బూతులు తిడుతూ చితక బాదారు. వారి సెల్ ఫోన్, బైక్ స్వాధీనం చేసుకుని 4 గంటలు రూంలో బంధించారు. ఈ మేరకు స్థానిక పీఎస్ లో కంప్లైంట్ చేశారు. ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.